ఏపీలో జనసేన సంచలనం...అన్ని స్థానాల్లో ఆధిక్యం

ఏపీలో జనసేన సంచలనం...అన్ని స్థానాల్లో ఆధిక్యం

విశ్వంభర,ఏపీ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తుంది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. తాను అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తనకు వచ్చిన సిట్లను బీజేపీకీ త్యాగం చేసిన జనసేన కేవలం 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో జనసేన తాను పోటీలో ఉన్న 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.

దీంతో మొదటి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న స్థానల సంఖ్య కంటే 100 ఫలితం ముఖ్యం అని తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు నిజమైనట్లు తెలుస్తుంది. కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 30 వేల పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో గతంలో తాను పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్, జనసేన చేరిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read More మంత్రి ఉత్తమ్ తండ్రికి  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు