ఎస్సీల భూమి ఆక్రమించారంటూ వీఆర్వోపై ఆరోపణలు.. కలెక్టరేట్ వద్ద నిరసన
- ఎస్సీల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళన
Anantapur News: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాయి. గ్రామానికి చెందిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 276లోని ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిందని, అయితే అదే భూమిని స్థానిక వీఆర్వో కుమారస్వామి తన భార్య పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ భూమిలో సుమారు 200 మంది ఎస్సీ కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇవ్వాల్సి ఉండగా, తమ హక్కులను కాలరాశారని వాపోయారు.
ఈ సమస్యపై గత రెండేళ్లుగా బుక్కరాయసముద్రం తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో చివరి మార్గంగా అనంతపురం కలెక్టరేట్కు చేరుకుని తప్పట్లు కొడుతూ నిరసన తెలుపుతూ తమ గోడును వినిపించారు. వీఆర్వో కుమారస్వామిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా జరిగిందని ఆరోపిస్తున్న భూ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి, ఎస్సీలకు కేటాయించిన భూమిని తిరిగి వారికి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఎస్సీల భూమి ఆక్రమించారంటూ వీఆర్వోపై ఆరోపణలు.. కలెక్టరేట్ వద్ద నిరసన
Anantapur News: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాయి. గ్రామానికి చెందిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 276లోని ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిందని, అయితే అదే భూమిని స్థానిక వీఆర్వో కుమారస్వామి తన భార్య పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ భూమిలో సుమారు 200 మంది ఎస్సీ కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇవ్వాల్సి ఉండగా, తమ హక్కులను కాలరాశారని వాపోయారు.
ఈ సమస్యపై గత రెండేళ్లుగా బుక్కరాయసముద్రం తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో చివరి మార్గంగా అనంతపురం కలెక్టరేట్కు చేరుకుని తప్పట్లు కొడుతూ నిరసన తెలుపుతూ తమ గోడును వినిపించారు. వీఆర్వో కుమారస్వామిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా జరిగిందని ఆరోపిస్తున్న భూ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి, ఎస్సీలకు కేటాయించిన భూమిని తిరిగి వారికి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


