తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

WhatsApp Image 2024-07-24 at 14.05.57_8189fea5
  విశ్వంభర  జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీలకు పక్క భవనం నిర్మించకపోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి తండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు