మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
On
విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతుల గురించి ఆరా తీశారు. అనంతరం వంటగదిని, స్టోర్ రూమ్ను పరిశీలించి నిల్వ ఉన్న సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, పారిశుధ్యం విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.



