తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా బింగి ధర్మవీర్ నియామకం
On
ప్రజా విశ్వంభర, నిజామాబాద్ :- తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా బింగి ధర్మవీర్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ నేత నియామక పత్రం అందజేశారు. ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ లోకి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘం నాయకుడు బింగి ధర్మవీర్ ను నియమించడం పట్ల పలువురు నాయకులూ హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి చేనేత సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతూ మీకు హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియయజేశారు. బింగి ధర్మవీర్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి భాధ్యతను అప్పగించిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ , నిరంతరం చేనేత సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.



