తీహార్ జైలులో ఉన్న కవితను కలిసిన కేటీఆర్..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం ఎన్ని సార్లు పిటిషన్లు వేసినా.. కోర్టులు తిరస్కరిస్తున్నాయి. అంతే కాకుండా ఆమెకు వరుసగా జ్యుడీషియల్ రిమాండ్ ను పెంచుతూనే ఉన్నాయి కోర్టులు. ఇక ప్రస్తుతం ఆమెకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ను మరో రెండు వారాల పాటు పొడిగించింది.
ఈ క్రమంలోనే తీహార్ జైల్లో ఉన్న కవితను తాజాగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు కవిత.
ఇక కవిత లిక్కర్ కేసులో ఆమెకు వరుసగా పరాజయం ఎదురవుతోంది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ఈ మేరకు సీబీఐ కేసులో ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇక కవిత ప్రస్తుతం చదువుకోవడానికి 9 పుస్తకాలను ఇచ్చారు.



