అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం...
On
ప్రముఖ కవి, 'జయ జయ హే తెలంగాణ..' ఉద్యమ గీత రచయిత, డా.అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని కేసీఆర్ అన్నారు.
ఉద్యమ కాలంలో అందెశ్రీ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.



