ఘనంగా పోచంపల్లి బ్యాంకు ప్రారంభోత్సవం -
ప్రారంభించిన రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి
- తుర్క యంజాల్ లో 11 వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన బ్యాంకు చైర్మన్ తడక రమేష్
విశ్వంభర, తుర్క యంజాల్ :- ది పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ 11 వ బ్రాంచ్ ను తుర్క యంజాల్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి , జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో నేషనలైజడ్ బ్యాంకు ల ధీటుగా పోచంపల్లి బ్యాంకు ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. రానున్న రోజుల్లో పోచంపల్లి బ్యాంకు సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయాలని కోరుతూ , బ్యాంకు చైర్మన్ తడక రమేష్ , కమిటికి శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు చైర్మన్ తడక రమేష్ మాట్లాడుతూ పోచంపల్లి బ్యాంకు వ్యవస్థను మొదటి బ్రాంచ్ ను ఫౌండర్ , చైర్మన్ కొంగరి భాస్కర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఏర్పాటు అయినా బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ పది బ్రాంచ్ లను ఏర్పాటు చేసుకొని నేడు 11 వ బ్రాంచ్ ను తుర్క యంజాల్ ఏర్పాటు చేయడం చాల సంతోషముగా ఉంది. త్వరలో మరికొన్ని ప్రాంతాలలో పోచంపల్లి బ్యాంకు లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఖచ్చితమైన సేవలను అందించడంలో పోచంపల్లి బ్యాంకు ముందు ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ సీత శ్రీనివాస్ , వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్ , డైరెక్టర్లు కర్నాటి బాల సుబ్రహ్మణ్యం , ఏలే హరి శంకర్ , సూరేపల్లి రమేష్ , రాపోలు వేణు , గుండు కావ్య, కర్నాటి భార్గవి , కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహా తో పాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.