గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

గాంధీజీ ఫౌండేషన్ వారి ఎనిమిదవ నెల సరుకుల పంపిణీ

ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం

WhatsApp Image 2024-08-01 at 15.49.56 చండూర్,విశ్వంభర :- రెండు సంవత్సరములు వరకు ప్రతినెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం గురువారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ , గాంధీజీ విద్యాసంస్థల ఉపాధ్యాయుల చేత ఎనిమిదవ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకుంటున్న గాంధీజీ ఫౌండేషన్ ను అభినందించారు. భవిష్యత్తులో గాంధీజీ ఫౌండేషన్ పేదలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్  సత్యనారాయణమూర్తి, పాలకూరి కిరణ్, కృష్ణయ్య, ఆనంద్,వెంకటేశ్వర్లు, వెంకన్న, శివప్రసాద్, మణిశంకర్, లింగస్వామి, ఆంజనేయులు, నాగరాజు,   బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

 

Read More ఘనంగా కవియిత్రి మొల్లమాంబ జయంతి.

     ఏలే మహేష్ నేత 
    సీనియర్ జర్నలిస్ట్ 
స్టేట్ ఛీఫ్ కరెస్పాండంట్ 
v3 న్యూస్ ఛానల్ & విశ్వంభర దిన పత్రిక 
సెల్ : 9705646377

 

 

 

 

 

Tags: