MLC కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన BRS రాష్ట్ర నాయకులు అందోజు శంకరా చారి
On
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మునుగోడు నియోజకవర్గం బిఆర్ యస్ నాయకులు అందోజు శంకరా చారి జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీళ్ళు నిధులు నియామకాలపై నడుస్తుంటే దానికి భాష, యాస, అస్తిత్వాన్ని జతకలిపి జాగో అన్న శక్తి అని ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు. తెలంగాణ సబ్బండ కులాల సమస్యలకు శాసనమండలిలో గొంతెత్తి, తెలంగాణ ప్రశ్నించే గొంతును అణచివేయాలని ఆరాటపడ్డ చిల్లర మూకల చిటపటలను చిదిమేసి ఎగిసిన కెరటమని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు.