బీఆర్ ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే

బీఆర్ ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే

 

బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి క్యూ కడుతుండగా.. ఆపేందుకు కేసీఆర్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే మరో షాక్ తగిలింది. తాజాగా చేవెళ్ల బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కూడా కారు దిగి రేవంత్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. 

Read More చిన్నారి గుండె ఆపరేషన్ కు ఆర్ధిక సాయం 

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యాదయ్యకు కండువా కప్పి ఆహ్వానించారు రేవంత్. దీపాదాస్ మున్షీ కూడా ఇందలో పాల్గొన్నారు. 

ఇప్పటికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి హస్తం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే.