కుందన్ బాగ్ అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు

పాల్గొన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వీనర్ మణిదీప్

కుందన్ బాగ్ అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు

ప్రజా విశ్వంభర, హైదరాబాద్: బేగంపేట  కుందన్ బాగ్ అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా యూత్ కన్వీనర్ మణిదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయతను తట్టి లేపేలా నిర్వహించిన పలు కార్యక్రమాలు  విశేషంగా ఆకట్టుకున్నాయి. అపార్ట్ మెంట్ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై  దేశభక్తిని చాటిచెప్పారు. ఈ సందర్భంగా  మణిదీప్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వేచ్ఛ వాయువులను  పీల్చుకుంటున్నామని, వారిని స్మరించుకోవడం  ప్రతి ఒక్కరి బాధ్యత అని  అన్నారు.

Related Posts