కేటీఆర్ వాహనం పై దాడి .. తృటిలో తప్పిన ప్రమాదం 

 కేటీఆర్ వాహనం పై దాడి .. తృటిలో తప్పిన ప్రమాదం 

ముషీరాబాద్ వద్ద కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు 
కొండా సురేఖపై ట్రోలింగ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్
పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

విశ్వంభర , ముషీరాబాద్ / హైద్రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ముషీరాబాద్ వద్ద ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశాయి. ముసీ నది పరివాహకప్రాంత నివాసితులకు భరోసా కల్పించేందుకు ఆయన వెళ్తుండగా... ముషీరాబాద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మూసీ నది రివర్ బెడ్ పరిధిలో ఉన్న నివాసాల కూల్చివేతలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పరిశీలించేందుకు, బాధితులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ చాదర్ ఘాట్ కు బయల్దేరారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ముషీరాబాద్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నాయి. కొందరు కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపైకి కూడా ఎక్కారు.  మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు బాధ్యత వహిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ను ముందుకు పంపించారు.

 

Read More ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాచం సత్యనారాయణ

 

 

 

 

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు