ప్రాణాలతో ఉంటా అనుకోలేదు: స్టార్ క్రికెటర్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చాలా రోజుల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ బాగా ఆడటంతో టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చాలా రోజుల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ బాగా ఆడటంతో టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్.. తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఓ షోలో తనఅనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
పంత్ మాట్లాడుతూ.. ‘రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని చాలా మార్చింది. ఆ సమయం ఎంతో అనుభవం నేర్పింది. తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది. ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించా. అది నరకంగా అనిపించింది. దాదాపు రెండు నెలలు బ్రష్ చేసుకోలేకపోయాను. వీల్చైర్లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేది. భయంగా ఉండేది. అందుకే ఎయిర్పోర్టుకు వెళ్లలేకపోయా. కానీ, భగవంతుడు రక్షించాడు’ అని రిషబ్ పంత్ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
అయితే, 2022 డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఐపీఎల్లోనూ అదరగొట్టి మరోసారి అభిమానుల ఆదరణ గెలుచుకున్నాడు.