అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలి .
తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షులు బో ర్రాజు లింగన్న యాదవ్ .
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల నీ మహబూబాబాద్ పోలీసుల అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బోర్రాజు లింగన్న యాదవ్ ఖండించారు . ఈ సందర్భంగా లింగన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రతి ఒక్కరూ ఖండించాలని , ప్రభుత్వ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు . రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల లో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , చేత తెలంగాణ మలిదశ , తొలి దశ , ఉద్యమకారులకు పెన్షన్స్ సౌకర్యం 25, 000 వేల రూపాయలు, 250 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు , ఇందిరమ్మ ఇల్లు , ప్రభుత్వ ప్రశంసాపత్రాలు, రైల్వే పాసులు , బస్సు పాసులు , మరియు ఆరోగ్య భీమా , కల్పిస్తానని అట్టి హామీని తక్షణమే నెరవేర్చాలని, ఉద్యమకారులు శాంతియుతంగా గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంటే తీవ్రవాదుల కంటే హీనంగా ఉద్యమకారులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని హెచ్చరించారు . జూన్ రెండు లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చకుంటే ఉద్యమకారుల ఉద్యమాన్ని దశలవారీగా తీవ్రతరం చేసి హాక్కులను సాధించుకునే దిశగా ముందుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఒకపక్క ఉద్యమకారులు ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను పోషించుకోలేని స్థాయిలో తీవ్ర దుర్భర జీవితాలు అనుభవిస్తూ రోగాల బారినపడి అనేక మంది ఉద్యమకారులు మరణిస్తుంటే ప్రభుత్వానికి పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఉద్యమకారుల పట్ల కాలయాపన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎంతకైనా తెగించి తీరుతామని వారు అన్నారు. జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం రేవంత్ ప్రభుత్వం పై ఉందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరబోయిన నరేష్ యాదవ్ , తేజావత్ వినయ్ , తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు .
అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలి .
తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షులు బో ర్రాజు లింగన్న యాదవ్ .
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల నీ మహబూబాబాద్ పోలీసుల అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బోర్రాజు లింగన్న యాదవ్ ఖండించారు . ఈ సందర్భంగా లింగన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రతి ఒక్కరూ ఖండించాలని , ప్రభుత్వ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు . రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల లో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , చేత తెలంగాణ మలిదశ , తొలి దశ , ఉద్యమకారులకు పెన్షన్స్ సౌకర్యం 25, 000 వేల రూపాయలు, 250 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు , ఇందిరమ్మ ఇల్లు , ప్రభుత్వ ప్రశంసాపత్రాలు, రైల్వే పాసులు , బస్సు పాసులు , మరియు ఆరోగ్య భీమా , కల్పిస్తానని అట్టి హామీని తక్షణమే నెరవేర్చాలని, ఉద్యమకారులు శాంతియుతంగా గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంటే తీవ్రవాదుల కంటే హీనంగా ఉద్యమకారులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని హెచ్చరించారు . జూన్ రెండు లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చకుంటే ఉద్యమకారుల ఉద్యమాన్ని దశలవారీగా తీవ్రతరం చేసి హాక్కులను సాధించుకునే దిశగా ముందుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఒకపక్క ఉద్యమకారులు ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను పోషించుకోలేని స్థాయిలో తీవ్ర దుర్భర జీవితాలు అనుభవిస్తూ రోగాల బారినపడి అనేక మంది ఉద్యమకారులు మరణిస్తుంటే ప్రభుత్వానికి పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఉద్యమకారుల పట్ల కాలయాపన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎంతకైనా తెగించి తీరుతామని వారు అన్నారు. జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం రేవంత్ ప్రభుత్వం పై ఉందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరబోయిన నరేష్ యాదవ్ , తేజావత్ వినయ్ , తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు .


