బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు. అయితే, దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్‌ను కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు సమాచారం. 

Read More ఫోన్ దొంగిలించి యూపీఐ ద్వారా నగదు చోరీ.. ముగ్గురు అరెస్ట్

అయితే, కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి కాపలా పెట్టాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్.. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని.. జీవన్‌రెడ్డి అనుచరులు బయభ్రాంతులకు గురిచేశారని బాధిడుతు తెలిపాడు. దీంతో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు ఆరు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

🕒 24 May 2024 ✍️ Desk

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు. అయితే, దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్‌ను కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు సమాచారం. 

అయితే, కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి కాపలా పెట్టాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్.. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని.. జీవన్‌రెడ్డి అనుచరులు బయభ్రాంతులకు గురిచేశారని బాధిడుతు తెలిపాడు. దీంతో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు ఆరు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

🔗 https://www.vishvambhara.com/crime/a-case-has-been-registered-against-former-brs-mla-jeevan/article-729

Related Posts

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?