కేరళలో బోణి కొట్టిన బీజేపీ... అత్యధిక మెజార్టీతో ఆ స్టార్ హీరో గెలుపు

కేరళలో బోణి కొట్టిన బీజేపీ... అత్యధిక మెజార్టీతో ఆ స్టార్ హీరో గెలుపు

విశ్వంభర,కేరళ : కేరళలో బీజేపీ సంచలనం సృష్టించింది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ కంచుకోట అయిన కేరళలో బీజేపీ సంచలన విజయం అందుకుంది. మాజీ రాజ్యసభ సభ్యులు, కోలీవుడ్ స్టార్ సురేష్ గోపి త్రిసూర్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. కాగా మరో స్థానంలో కూడా బీజేపీ ప్రస్తుతం లీడ్ లో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సౌత్ రాష్ట్రాలపై గట్టి నమ్మకం పెట్టుకుంది. కానీ తమిళనాడులో ఊహించిన ఫలితాలు రాకపోవడంతో బీజేపీ కాస్తా డీలా పడింది. కానీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.