ఎర్ర బంగారం రైతుల కన్నీరు తుడిచేది ఎవరు....!?

ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు రాక మార్కెట్ లోనే రైతులు పడి గాపులు..!

ఎర్ర బంగారం రైతుల కన్నీరు తుడిచేది ఎవరు....!?

విశ్వంభర, వరంగల్ :-  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న రైతుల కన్నీటి కష్టం తీరడం లేదు.. ఆరుగాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరదాకా రైతులు లబోదిబో ఇవ్వమంటున్నారు. వరంగల్ మార్కెట్ యార్డులో రాత్రికి రాత్రే ఎర్ర బంగారం అంటే మిర్చితో మార్కెట్ నిండిపోయింది. క్వాలిటీ మిర్చి అనేక బస్తాలకు బస్తాలు క్వింటాలకు వరంగల్ మార్కెట్ యార్డులో నుండి ఉండడంతో దళారులకు వరంగా మారిపోయింది.. కాగా గత సంవత్సరంలో కింటాకు రూ /- 17,000 అమ్ముడుపోయిన క్వాలిటీ మిర్చి ఇప్పుడు కనీసం రూ /- 12000 కూడా అమ్ముడుపోవటం లేదని రోజు రోజుకి ప్రభుత్వాలు ధరను దించేస్తూ ఎవరు కొనట్లేదని మార్కెట్లోనే పడిగాపురం కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పండించిన రైతులు ఎక్కువ ధర వస్తుందని అనేక జిల్లాల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మిర్చిని అధికంగా పండించారు.. మార్కెట్లో పెట్టిన మిర్చికి కనీసం గిట్టుబాటు ధర రాక రైతులు పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి కూడా లభించకపోవడంతో మిర్చి ఘాటు రైతుల కండ్లబెట్టి నీళ్లను కారేలా చేస్తోంది.. కూలీలకు వందలకు వంద రూపాయలు ఇస్తే పెట్టిన పెట్టుబడి రానుపోను రవాణా ఖర్చులు కలిపి తడిసి మూవ్ పెడవడంతో ఇక్కడ మార్కెట్ కి వచ్చాక ఎర్ర బంగారం మిర్చికి సరైన ధర లేకపోవడం ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక రైతులు కన్నీరు కారుస్తున్నారు...
క్వాలిటీ మిర్చి ఉన్నప్పటికీ అది బాగాలేదు ఇది బాగాలేదు తడిసింది ఇంకా ఎండాలి అనే సాకులతో ధరను తగ్గించేస్తే రైతుల కడుపు కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలోని మార్కెట్లోని మిర్చిని వెంటనే కొనుగోలు చేయాలని లేకపోతే రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వార్తలు వినపడడంతో రైతులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి... ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల ఆవేదనను అర్థం చేసుకొని సరైన ధరకు కొనుగోడు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు అభ్యర్థిస్తున్నారు..

Tags: