చేనేత వస్త్రాలు ధరించండి. నేతన్నకు చేయూతనివ్వండి.
-మీడియా జాతీయ ఇన్చార్జి అవ్వారి భాస్కర్
On
ప్రజా విశ్వంభర, నారాయణగూడ : వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నారాయణగూడ పద్మశాలి భవన్లో ఏర్పాటుచేసిన హ్యాండ్లూమ్ ఎక్స్పోను అఖిల భారత పద్మశాలి యువజన విభాగం, మీడియా జాతీయ ఇన్చార్జి అవ్వారి భాస్కర్ సందర్శించారు. చేనేత వస్త్రాలు ప్రపంచం నలుమూలలా చాలా ఆదరణ లభించాయని , కాలానుగుణంగా చేనేత వస్త్రాలు మన్నికగా ఉంటాయని అన్నారు. చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు చేయూతనివ్వాలని , కార్మికుల కళ నైపుణ్యానానికి వారి ప్రతిభను గుర్తించి ఆర్థికపరమైన ప్రోత్సహం చేనేత కొనుగోళ్ల ద్వారా అందించి మద్దతు ఇవ్వాలని కోరారు.ఉత్పత్తిదారుల నుండి సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు ఈ ఎక్స్పో ద్వారా అందుబాటులో ఉన్నాయని ఇట్టి అవకాశాన్ని హైదరాబాద్ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తద్వారా చేనేత వృత్తిని ప్రోత్సహించిన వారు అవుతారని తెలిపారు. చేనేత వస్త్ర ప్రదర్శన ను తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగ ప్రెసిడెంట్ గుంటక రూప ఏర్పాటు చేసి చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులను ఒకే చోట ఎక్స్పో ద్వారా ప్రదర్శనకు కల్పించడం చాల అభినందనీయమని వారు అన్నారు. అలాగే యాభై కు పైగా స్టాల్ల్స్ ఏర్పాటు చేసి పద్దెనిమిది రాష్ట్రాల నుండి వచ్చిన పలు రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో చేనేత వ్యవస్థను , కార్మికుల కొరకు ఏదో ఒక రూపంలో అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్, ,తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్, ఏబీపీఎస్ యువజన విభాగం సెక్రటరీ బరెంకల ప్రియ, టిపిఎస్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ సప్నా రాజ్ కుమార్ చిన్నకోట్ల , గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ , ఏబిపీఎస్ కోశాధికారి కొక్కుల దేవేందర్, బి టిపి పిఎస్ మహిళా విభాగం కోశాధికారి రేఖా నోముల , సికింద్రాబాద్ పద్మశాలి సమాజం అధ్యక్షులు నోముల రాంప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి యువజన విభాగం అధ్యక్షులు చిన్ని రాకేష్ అరుణశ్రీ ,కైరం కొండస్వరూప, బొమ్మరిల్లు విజయ ,సన్నపురి సరోజ , మౌనికకటకం ,ఆడెపు శాంతి అర్షణ్ పల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు



