తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలి 

- పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్

తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలి 

  • త్వరలో విగ్రహ ఏర్పాటుకై రౌండ్ టేబుల్ సమావేశం 

విశ్వంభర, ఎల్బీనగర్ :- నూతనంగా ఏర్పడిన పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ మొదటి సమావేశం ఎల్బీనగర్ లోని కొత్తపేటలో సంఘ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పద్మశాలి సంఘం అభ్యున్నతికి మరింత పాటు పడాలని కమిటీ సభ్యులకు పలు సూచనలు చేసారు. కమిటీ ప్రమాణ స్వీకారం తరువాత మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభ్యులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు.  ఈ సమావేశంలో అధ్యక్షుడు పున్న గణేష్ నేత మాట్లాడుతూ  సంఘ పురోగతికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలనీ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పద్మశాలి సంఘాలు ఎల్బీనగర్ సంఘాన్ని  ఆదర్శం గా తీసుకొని ముందుకు సాగుతున్నాయని అన్నారు. భవిషత్తులో బలమైన సంఘ నిర్మాణంలో ప్రతి పద్మశాలీ భాగస్వామ్యం కావాలని కోరారు. ఎల్బీనగర్ లో తెలంగాణ జాతిపిత  కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు కు త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.  తెలంగాణకు ఎనలేని కృషి చేసి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో శాయశక్తులు పోరాడి మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్ నేత ,  ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మి నారాయణ, దసరా మేళా కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ , గౌరవ అధ్యక్షులు  వేమూరి రాము నేత, రాపోలు సుధాకర్,  మహిళలు, వివిధ ప్రాంతాల డివిజన్ అధ్యక్షా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.  

Tags: