తెలంగాణ ప్రజానాట్య మండలి మహాసభలను జయప్రదం చేయాలి
విశ్వంభర, రామన్నపేట: ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరులో జరిగే తెలంగాణ ప్రజా నాట్య మండలి జిల్లా మూడవ మహాసభలు జరుగుతున్నవని, ఈ మహాసభలకు రామన్నపేట మండలంలోని బాగోతం, భజన, బుర్రకథ, డోలు దెబ్బ, బుడగ జంగాల ఒగ్గు కథ, కోలాటం కళాకారులు, డప్పు కళాకారులు వివిధ కళారూపాల్లో ఉన్న కళాకారులు ఆ గ్రామాల కమిటీలలో ఉన్న కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆలేరులో జరిగే మహాసభలకు హాజరై జయప్రదం చేయగలరని కోరుతున్నామని తెలంగాణ ప్రజా నాట్య మండలి భాగవత భజన జానపద కళాకారుల రామన్నపేట మండల అధ్యక్షుడు కంకల మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా నాట్య మండలి భాగవత భజన జానపద కళాకారుల రామన్నపేట మండల అధ్యక్షుడు కంకల మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు బలుగూరి రవి, కార్యదర్శి కొంగరి జంగయ్య, బలుగూరి లింగస్వామి, శ్రీరామోజు నరసింహాచారి, వీసం గాలయ్య, మామిడి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజానాట్య మండలి మహాసభలను జయప్రదం చేయాలి
విశ్వంభర, రామన్నపేట: ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరులో జరిగే తెలంగాణ ప్రజా నాట్య మండలి జిల్లా మూడవ మహాసభలు జరుగుతున్నవని, ఈ మహాసభలకు రామన్నపేట మండలంలోని బాగోతం, భజన, బుర్రకథ, డోలు దెబ్బ, బుడగ జంగాల ఒగ్గు కథ, కోలాటం కళాకారులు, డప్పు కళాకారులు వివిధ కళారూపాల్లో ఉన్న కళాకారులు ఆ గ్రామాల కమిటీలలో ఉన్న కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆలేరులో జరిగే మహాసభలకు హాజరై జయప్రదం చేయగలరని కోరుతున్నామని తెలంగాణ ప్రజా నాట్య మండలి భాగవత భజన జానపద కళాకారుల రామన్నపేట మండల అధ్యక్షుడు కంకల మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా నాట్య మండలి భాగవత భజన జానపద కళాకారుల రామన్నపేట మండల అధ్యక్షుడు కంకల మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు బలుగూరి రవి, కార్యదర్శి కొంగరి జంగయ్య, బలుగూరి లింగస్వామి, శ్రీరామోజు నరసింహాచారి, వీసం గాలయ్య, మామిడి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.


