అమృత్ 2.0 నిర్లక్ష్యంపై  ప్రజావాణిలో  ఫిర్యాదు 

అమృత్ 2.0 నిర్లక్ష్యంపై  ప్రజావాణిలో  ఫిర్యాదు 

విశ్వంభర, మహబూబాబాద్ :  మహబూబాబాద్ మున్సిపాలిటీ  పరిధిలోని  6వ వార్డు బేతోలు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా మంచి నీటి శాశ్వత పరిష్కారం కోసం 2500 వేల మీటర్స్ తో 30 లక్షల రూపాయల అంచనా తో ప్రతి ఇంటింటికి నల్లా ల  తో పాటు 24/7 వాటర్ సప్లై చేసే పథకం ద్వారా పైలెట్ ప్రాజెక్టు కింద బేతోలు గ్రామంలో పైప్ లైన్ పనులు మొదలు పెట్టి సుమారు 11 నెలలు అవుతుంది . ఈ సందర్భంగా బేతో ల్ గ్రామానికి చెందిన  చెందిన ఖాదర్ బాబా మాట్లాడుతూ,  కానీ ఇంతవరకు త్రాగునీరు సదుపాయం ప్రజలకు అందలేదు ఇది వేసవికాలం అయినందున ప్రజలు తాగునీటి కోసం చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ,  ప్రజలు మంచినీటి కోసం చాలా సమయం వేచి చూసి మంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుంది అని గుర్తు చేశారు .  కొంత మంది దగ్గరలో ఉన్న కలుషిత బావి నీటిని త్రాగడం వలన పెద్దలు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు  అని ఆయన అన్నారు.  గ్రామంలో నీ దళిత వాడలో మిషిన్ భగీరథ పనులు పూర్తియిన కనీసం కనెక్షన్ కూడా ఇంతవరకు  ఇవ్వలేదు దీని కారణంగా మేము తాగునీటికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము మా బేతోలు ప్రాంత వాసులకి ఇంతటి మంచి నీటి కొరత ఉన్నందున పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకి ఫిర్యాదు చేసిన కూడా ఇప్పటి వరకు స్పందించకుండా అమృత్ 2.0 పథకాన్ని 11 నెలలుగా నిర్లక్ష్యం చేస్తూ పనులల్లో జాప్యం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ మరియు అధికారుల పై చర్యలు తీసుకొని తక్షణమే అమృత్ 2.0 యొక్క పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి మాకు సహకరించగలరని,  ఇట్టి సమస్యను తీర్చాలని ఈరోజు ప్రజావాణిలో కూడా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశామని అన్నారు .

🕒 19 May 2026 ✍️ Desk

అమృత్ 2.0 నిర్లక్ష్యంపై  ప్రజావాణిలో  ఫిర్యాదు 

విశ్వంభర, మహబూబాబాద్ :  మహబూబాబాద్ మున్సిపాలిటీ  పరిధిలోని  6వ వార్డు బేతోలు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా మంచి నీటి శాశ్వత పరిష్కారం కోసం 2500 వేల మీటర్స్ తో 30 లక్షల రూపాయల అంచనా తో ప్రతి ఇంటింటికి నల్లా ల  తో పాటు 24/7 వాటర్ సప్లై చేసే పథకం ద్వారా పైలెట్ ప్రాజెక్టు కింద బేతోలు గ్రామంలో పైప్ లైన్ పనులు మొదలు పెట్టి సుమారు 11 నెలలు అవుతుంది . ఈ సందర్భంగా బేతో ల్ గ్రామానికి చెందిన  చెందిన ఖాదర్ బాబా మాట్లాడుతూ,  కానీ ఇంతవరకు త్రాగునీరు సదుపాయం ప్రజలకు అందలేదు ఇది వేసవికాలం అయినందున ప్రజలు తాగునీటి కోసం చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ,  ప్రజలు మంచినీటి కోసం చాలా సమయం వేచి చూసి మంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుంది అని గుర్తు చేశారు .  కొంత మంది దగ్గరలో ఉన్న కలుషిత బావి నీటిని త్రాగడం వలన పెద్దలు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు  అని ఆయన అన్నారు.  గ్రామంలో నీ దళిత వాడలో మిషిన్ భగీరథ పనులు పూర్తియిన కనీసం కనెక్షన్ కూడా ఇంతవరకు  ఇవ్వలేదు దీని కారణంగా మేము తాగునీటికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము మా బేతోలు ప్రాంత వాసులకి ఇంతటి మంచి నీటి కొరత ఉన్నందున పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకి ఫిర్యాదు చేసిన కూడా ఇప్పటి వరకు స్పందించకుండా అమృత్ 2.0 పథకాన్ని 11 నెలలుగా నిర్లక్ష్యం చేస్తూ పనులల్లో జాప్యం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ మరియు అధికారుల పై చర్యలు తీసుకొని తక్షణమే అమృత్ 2.0 యొక్క పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి మాకు సహకరించగలరని,  ఇట్టి సమస్యను తీర్చాలని ఈరోజు ప్రజావాణిలో కూడా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశామని అన్నారు .

🔗 https://www.vishvambhara.com/telangana/amrit-20-public-complaint-on-negligence/article-15432

Tags: