శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పణ
On
- పట్టు వస్త్రాలు అందించిన యాదగిరిగుట్ట నిత్యాన్న సత్రం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు
విశ్వంభర, యాదగిరి గుట్ట : పాత గుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలను శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి నిత్యాన్న సత్రం యాదగిరిగుట్ట అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు సమర్పించారు. బ్రహ్మోత్సవాలో భాగంగా లక్ష్మి నరసింహ స్వామి వారికీ పట్టు వస్త్రాలు అందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. వీరితోపాటు కుటుంభం సభ్యులు , కమిటీ సభ్యులు పాల్గొన్నారు.