షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

 

ఈ నడుమ వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బూర్గుల గ్రామ శివారులోని స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలింది. 

Read More  నిరుపేదలకు అండగా గాంధీజీ ఫౌండేషన్   

దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా ఇందులో పనిచేస్తున్న కార్మికులు ఆరుగురు చనిపోయారు. ఇంకో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక సేవలు అందిస్తున్నారు. అయితే గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.