గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘం -ఎస్సై వెంకన్న గౌడ్

గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘం -ఎస్సై వెంకన్న గౌడ్

- గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

- గాంధీజీ ఫౌండేషన్ వారి 11వ నెల సరుకుల పంపిణీ 

విశ్వంభర, చండూర్ : రెండు సంవత్సరాల వరకు ప్రతినెల 22 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం దీపావళి పండుగను పురస్కరించుకొని రెండు రోజులు ముందుగానే బుధవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు పదకొండవ నెల పంపిణీ చేసారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎస్సై వెంకన్న గౌడ్  హాజరై వారు మాట్లాడుతూ డాక్టర్ కోడి శ్రీనివాసులు చండూరు మున్సిపాలిటీకి ఆదర్శవంతమైన వ్యక్తి అని, సమాజంలో డబ్బులు ఉన్న వారందరూ సేవ చేయరని, సేవ చేయాలనే ఆలోచన డాక్టర్ కోడి శ్రీనివాసులు రావడం అభినందనీయమని, నిరుపేదలకు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పదని కొనియాడారు. ఏ ఆసరా లేని నిరుపేదలను చూస్తుంటే మనసు కలచివేస్తుందని, వీరికి త్వరలోనే నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి కార్యక్రమం చేస్తానని తెలిపారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు.  ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కోడి అరుణ, కోడి ప్రీతి, కోడి శృతి, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు