గజ్వేల్ లో మెగా రక్తదాన శిబిరం
విశ్వంభర, గజ్వేల్ : ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో గజ్వేల్ లో మెగా హెల్త్ క్యాంప్ నర్సన్న ఆదేశాలతో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్ష రెడ్డి ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, టౌన్ ప్రెసిడెంట్ మునగారి రాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. వీరితో పాటు గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు షాహిద్ అహ్మద్, జంగం రమేష్ గౌడ్, గుంటుకు శ్రీను, ఫస్ట్ వార్డ్ యాదగిరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమీర్, సత్తన్న, శేఖర్ , ధర్మారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ సుఖేందర్ రెడ్డి , అందరూ మాట్లాడుతూ ఇలాంటి క్యాంప్ ను నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మెడిసిటీ హాస్పిటల్ వారు ఇస్తున్న సదుపాయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఫ్రీ ఆపరేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్లు మార్కెటింగ్ మెంబర్లు చాలా బాగా స్పందించారని ఇలాంటి మెగా క్యాంపులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిర్వహించి గజ్వేల్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని గజ్వేల్ కాంగ్రెస్ శ్రేణులు తెలియజేయడం జరిగింది.