పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి వారి మాటల్లోనే తెలుస్తోంది : మల్లు రవి

పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి వారి మాటల్లోనే తెలుస్తోంది : మల్లు రవి

విశ్వంభర,హైదరాబాద్ : పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి వారి మాటల్లోనే తెలుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఈ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుతుతారా ..? అని ప్రశ్నించారు.

ఆ కళాశాల వారే పట్టభద్రులు... మిగిలిన వారు కాదు అన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందన్నారు. కాబట్టి కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలి లేదంటే ఆ వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Read More గౌడ సంఘం అధ్యక్షులుగా కందాల వెంకట్రాజం గౌడ్