చలివేంద్రం ప్రారంభించిన లేబర్ అధికారి కృష్ణ సాగర్.

చలివేంద్రం ప్రారంభించిన లేబర్ అధికారి కృష్ణ సాగర్.

విశ్వంభర, మెట్ పల్లి :- జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద తెలంగాణ భవన ,  ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్వో ఆర్ శ్రీనివాస్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా లేబర్ అధికారి కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. వేసవికాలం రిత్యా నేటి నుండి  ప్రజల సౌకర్యార్థమై పాత బస్టాండ్ కూడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,వ్యవసాయదారులు, ఇతర నిర్మాణ కూలీలు ప్రతి ఒక్కరికి దాహార్తి తీర్చేందుకు  అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఐటియుసి నాయకులు ముక్రం మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Tags: