లక్ష్మీపురంలో కాంగ్రెస్ యాత్ర రాజ్యాంగాన్ని రక్షించుకుందామని పిలుపు..
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని లక్ష్మీపురంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఎమ్మెల్యే డా. మురళి నాయక్,డిసిసి అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో వీధివీధిన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు.పార్టీ గ్రామ అధ్యక్షుడు ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత10 సం.లలో గ్రామాభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే మురళి నాయక్ గ్రామం పై దృష్టి పెట్టి చిన్న ముప్పారం నుంచి లక్ష్మీపురం వరకు బిటి రోడ్డు సాంక్షన్,గ్రామంలో సిసి రోడ్లు,మంగలి తండాకు మంచినీటి సౌకర్యం తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు.కార్యక్రమం లో ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము,నాయకులు కూరెల్లి సతీష్,బైరు అశోక్ గౌడ్,చిన్నాల కట్టయ్య,కదిరె జగన్,రావుల మల్లేశం,కర్నెకంటి వెంకటరెడ్డి,భూక్య ప్రభాకర్,సతీష్ చారి వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.