కందగట్ల స్వామికి చేనేత దినోత్సవ ఆహ్వానం 

కందగట్ల స్వామికి చేనేత దినోత్సవ ఆహ్వానం 

ప్రజా విశ్వంభర, ఎల్ బీ నగర్ : 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత కన్వీనర్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత ఆధ్వర్యములో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఆగస్ట్ 7 వ తేదీన ఆటో నగర్ లోని కర్నాటి గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి నేతను నారాయణగూడ పద్మశాలి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.  చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత కళాకారులు, జాతీయ చేనేత అవార్డు గ్రహీతలకు  సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.  అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్బంగా నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే చేనేత కార్మికులకు , అవార్డు గ్రహీతలకు సన్మానం చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. తప్పకుండ హాజరు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పెద్ది జగదీశ్ నేత , పులగం రాములు నేత , పొట్టబత్ని జ్ఞానేశ్వర్ నేత , జెల్ల నరేందర్ నేత , బొమ్మ దశరధ నేత , శివ నేత తదితరులు పాల్గొన్నారు. 

Tags: