ట్రాక్ తప్పిన గూడ్స్ రైలు...పలు రైళ్లకు అంతరాయం

ట్రాక్ తప్పిన గూడ్స్ రైలు...పలు రైళ్లకు అంతరాయం

విశ్వంభర, దామచర్ల : నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పక్కకు ఒరిడిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్ లో ఉండటంతో డ్రైవర్ చాకచక్యంగా బ్రేకులు వేసి మిగితా బోగీలు పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో గుంటూరు ‌‌– సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు రాగా ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.