దత్తాత్రేయ ఆత్మీయ భేటీ

దత్తాత్రేయ ఆత్మీయ భేటీ

విశ్వంభర, అంబర్‌పేట : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌కు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు కెంచె చంద్రశేఖర్ నివాసాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి చేసిన సేవలను దత్తాత్రేయ గుర్తుచేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు

Tags: