బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజి జయంతి వేడుకలు
On
విశ్వంభర, రామన్నపేట: పట్టణ కేంద్రంలో బుధవారం రోజు బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్, అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యం, వీరత్వానికి ప్రతీక, ధర్మరక్షణకై అంకితమైన శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నకిరేకల్ ఇంచార్జ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, బిజెపి మండల నాయకులు మల్లికార్జునచారి, సంతోష్ కుమార్, దావనూరి అజయ్, బొడిగె వెంకట్, రేపాక లింగస్వామి, బోయపల్లి ప్రవీణ్ కుమార్, గన్నెబోయిన మధు, కంభంపాటి శివరంజన్, బందెల సంజీవ, పొట్టబత్తుల వెంకటేష్, ఆకిటి వేణు తదితరులు పాల్గొన్నారు.



