ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆహ్వాన పత్రిక
On
విశ్వంభర, ఎల్బీనగర్ : మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎమ్మెల్యే ఈ సందర్బంగా మాట్లాడుతూ తప్పకుండా వస్తాను అని హామీ ఇచ్చారని సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ అన్నారు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ చేపూరి శంకర్ ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. వారు వెంటనే తమ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదర్ తెరిసా సొసైటీ, సాగర్ రెడీ టు సర్వో ఫౌండేషన్ అధ్యక్షులు పెద్ది శంకర్ , శైలజ, వరలక్ష్మి, ఉమా, హసీనా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



