ఎమ్మెల్యే జన్మదినం సందర్బంగా మెగా రక్తదాన శిబిరం
On
విశ్వంభర, తెల్కపల్లి ; నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా తెలకపల్లి మాజీ ఎంపిపి బండ పర్వతాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న ఎమ్మెల్యే కు పుట్టినరోజు సందర్బంగా దేవుడికి ప్రత్యేక పూజలు జరపడం, బాణ సంచా , స్వీట్ , రోగులకు పండ్ల పంపిణి జరిగిందని, వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నాని అన్నారు. ఈ యొక్క రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున స్థానికులు , గ్రామస్తులు , కార్యకర్తలు, అభిమానులు , నాయకులూ పాల్గొని రక్తదానం చేశారు.



