మలేషియా మాస్టర్స్ ఫైనల్లో సింధు ఓటమి!
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మలేసియా మాస్టర్స్ ఫైనల్ మ్యాచ్లో చుక్కెదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మలేసియా మాస్టర్స్ ఫైనల్ మ్యాచ్లో చుక్కెదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి గేమ్లో ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు గేమ్లలో తేలిపోయింది. ముఖ్యంగా రెండో సెట్లో 5-21 భారీ వ్యత్యాసంతో వెనుకబడింది. కాగా, సింధు తప్పిదాలను వాంగ్ జీయీ చక్కగా ఉపయోగించుకుంది.
మొదటి గేమ్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన సింధు.. రెండో గేమ్లో ఆ దూకుడును చూపలేకపోయింది. ఇక మూడో గేమ్లో సింధు దూకుడు పెంచినా.. వాంగ్ జీయీ అద్భుత రీతిలో పుంజుకుంది. చక్కటి ప్లేస్మెంట్లు, షాట్లతో రెండు, మూడు గేమ్లను సొంతం చేసుకుంది. దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు మలేసియా మాస్టర్స్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోవాలనుకున్న సింధుకు నిరాశే మిగిలింది.