లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? : ప్రియాంక గాంధీ సూటి ప్రశ్న

లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? : ప్రియాంక గాంధీ సూటి ప్రశ్న

విశ్వంభర, ఢిల్లీ : నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కొంతమంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని, ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

మొదట, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది, ఇప్పుడు దాని ఫలితాల్లో కూడా స్కామ్ జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే సెంటర్‌‌లో ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు తెచ్చుకున్నారు. ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read More విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

ఇది చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరం. లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? నీట్ పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్‌కు సంబంధించిన చట్టబద్ధమైన ప్రశ్నలకు విద్యార్థులకు సమాధానాలు అవసరం. న్యాయబద్ధమైన ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ఎక్స్‌లో అన్నారు.
అలాగే, నీట్ పరీక్షపై, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం స్పందించారు.

నీట్‌తో సహా అనేక పరీక్షలలో పేపర్ లీక్‌లు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగంగా మారాయి. దీనికి మోడీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలి. అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, 2024 నీట్ పరీక్షను రద్దు చేయాలని దానిని తిరిగి నిర్వహించాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు