ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా విజయానంద్?
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్(చీఫ్ సెక్రెటరీ)గా కె.విజయానంద్ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఏపీలో వైసీపీ సర్కార్ దిగిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వంలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కీలక పదవులతో పాటు ప్రభుత్వ ఉన్నత అధికారుల పోస్టింగుల్లో కీలక మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్(చీఫ్ సెక్రెటరీ)గా కె.విజయానంద్ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదనపు బాధ్యతల్లో భాగంగా ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారు. బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా, ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. త్వరలో ఎన్డీఏ కూటమి నిర్ణయం మేరకు ఆయన ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీగా నియామం చేపట్టే అవకాశాలు ఉన్నాయని టీడీపీ-జనసేన-బీజేజేపీ కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నారు.