కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు నుంచి రొయ్యల లోడ్‌తో వస్తున్న లారీని, పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న మరో లారీ ఢీకొంది. 

కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుల్లో ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు. 

మరో లారీలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడున్నారు. ఘటనాస్థలంలో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4గంటలకు ప్రమాదం జరగగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Related Posts