బిగ్ బ్రేకింగ్... లొంగిపోయిన 30 మంది మావోయిస్టులు
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ ప్రాంతాల్లో తరుచూ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగి... దాదాపు 15 మంది వరకు మవోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు కూడా భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అలా ఎన్నికలు ముగిసేంత వరకు తరుచూ ఎదురుకాల్పులు జరిగి మావోయిస్టులు మృతి చెందగా... జవాన్లకు గాయాలు అయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఒకేసారి 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నాలుగో విడత ఎన్నికలు ముగిసిన అనంతరం మావోయిస్టులు లొంగిపోవడం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: 30-maoists