చేనేత కార్మికుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి-ప్రభుత్వానికి చేనేత కార్మికుల విజ్ఞప్తి
-

విశ్వంభర ,నారాయణపూర్ : - సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం చేనేత సహకార సంఘంలో చేనేత కార్మికులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. చేనేత కార్మికులు తీసుకున్న బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం చేనేత పరిశ్రమ తాము నేసిన వస్త్రాలు అమ్ముడుపోక బీదరికం అనుభవిస్తున్నారు.బ్యాంకు రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు.బ్యాంకు వాళ్లు లాయర్ నోటీసులు పంపించడం వలన కార్మికులు ఆందోళన చెందుతున్నారు.కావున తమ యొక్క బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే గతంలో ఉన్నటువంటి త్రిబుల్ స్కీం,నూలు సబ్సిడీ,చేనేత భీమా,చేనేత కార్మికులు వృద్ధులకు కొత్త పింఛన్లు,మొదలగు పథకాలన్నీ అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంగిశెట్టి లక్ష్మీనారాయణ,ఏలే అశోక్,సింగం కృష్ణ,గుర్రం సత్యనారాయణ,గంజి రాములు,దోనాల శ్రీను,దోర్నాల దాసు,దోర్నాల సత్యనారాయణ,ఎలే యాదగిరి,విడం వెంకటేశం,కర్నాటి నరేష్,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి-ప్రభుత్వానికి చేనేత కార్మికుల విజ్ఞప్తి

విశ్వంభర ,నారాయణపూర్ : - సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం చేనేత సహకార సంఘంలో చేనేత కార్మికులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. చేనేత కార్మికులు తీసుకున్న బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం చేనేత పరిశ్రమ తాము నేసిన వస్త్రాలు అమ్ముడుపోక బీదరికం అనుభవిస్తున్నారు.బ్యాంకు రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు.బ్యాంకు వాళ్లు లాయర్ నోటీసులు పంపించడం వలన కార్మికులు ఆందోళన చెందుతున్నారు.కావున తమ యొక్క బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే గతంలో ఉన్నటువంటి త్రిబుల్ స్కీం,నూలు సబ్సిడీ,చేనేత భీమా,చేనేత కార్మికులు వృద్ధులకు కొత్త పింఛన్లు,మొదలగు పథకాలన్నీ అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంగిశెట్టి లక్ష్మీనారాయణ,ఏలే అశోక్,సింగం కృష్ణ,గుర్రం సత్యనారాయణ,గంజి రాములు,దోనాల శ్రీను,దోర్నాల దాసు,దోర్నాల సత్యనారాయణ,ఎలే యాదగిరి,విడం వెంకటేశం,కర్నాటి నరేష్,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


