శ్రీకాంత్ చారి త్యాగం చిరస్మరణీయం : కాలేరు వెంకటేష్
విశ్వంభర, గోల్నాక : తెలంగాణ రాష్ట్ర సాధనలో కాసోజు శ్రీకాంత్ చారి చేసిన త్యాగం చిరస్మరణీయమని, యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని హైదరాబాదు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని శ్రీకాంత్ చారి విగ్రహానికి శ్రీ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నివాళులు అర్పించారు. సంఘం అధ్యక్షుడు గొట్టాల వినోద్ కుమార్ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ జే. నర్సయ్య, సిఐ కిరణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గ ప్రసాద్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, ఆర్కే బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, సంఘ ప్రధాన కార్యదర్శి పోలోజు వేణుగోపాల్ చారి, కోశాధికారి వుల్లెంగుల కృష్ణమాచారి, ముఖ్య సలహాదారులు శ్రీరామదాసు సంజీవ చారి, పడకండి అంజయ్య చారి, పులిమామిడి శ్రీహరి చారి, మేడ్చల్ సంపత్, కార్యవర్గ సభ్యులు గోపాల చారి, ఎల్లచారి, గన్నోజీ కృష్ణాచారి, సాయికుమార్, వేణు, రాము, రవీందర్ చారి, కొక్కొండ శ్రీనివాస్ చారి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాంత్ చారి త్యాగం చిరస్మరణీయం : కాలేరు వెంకటేష్
విశ్వంభర, గోల్నాక : తెలంగాణ రాష్ట్ర సాధనలో కాసోజు శ్రీకాంత్ చారి చేసిన త్యాగం చిరస్మరణీయమని, యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని హైదరాబాదు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని శ్రీకాంత్ చారి విగ్రహానికి శ్రీ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నివాళులు అర్పించారు. సంఘం అధ్యక్షుడు గొట్టాల వినోద్ కుమార్ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ జే. నర్సయ్య, సిఐ కిరణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గ ప్రసాద్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, ఆర్కే బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, సంఘ ప్రధాన కార్యదర్శి పోలోజు వేణుగోపాల్ చారి, కోశాధికారి వుల్లెంగుల కృష్ణమాచారి, ముఖ్య సలహాదారులు శ్రీరామదాసు సంజీవ చారి, పడకండి అంజయ్య చారి, పులిమామిడి శ్రీహరి చారి, మేడ్చల్ సంపత్, కార్యవర్గ సభ్యులు గోపాల చారి, ఎల్లచారి, గన్నోజీ కృష్ణాచారి, సాయికుమార్, వేణు, రాము, రవీందర్ చారి, కొక్కొండ శ్రీనివాస్ చారి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


