తెలంగాణలో ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదల

విశ్వంభర, వెబ్ డెస్క్ : తెలంగాణ ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్​ ఎస్. జ్యోతిరాదిత్య( శ్రీకాకుళం, పాలకొండ), రెండో ర్యాంక్ హర్ష (కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌-పంచలలింగాల), మూడో ర్యాంకు రిషి శేఖర్ శుక్లా(సికింద్రాబాద్ - తిరుమలగిరి), నాలుగో ర్యాంకు సందేశ్( హైదరాబాద్- మాదాపూర్), ఐదో ర్యాంక్​ సాయి యశ్వంత్ రెడ్డి (కర్నూల్)సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో ఫస్ట్ ర్యాంక్ ప్రణీత(మదనపల్లె), రెండో ర్యాంకు రాధకృష్ట(విజయనగరం), మూడో ర్యాంక్​ శ్రీ వర్షిణి(హనుమకొండ), నాలుగో ర్యాంకు సాకేత్ రాఘవ్(చిత్తూరు), ఐదో ర్యాంక్ సాయి వివేక్(హైదరాబాద్) సాధించారు.