పోచమ్మతల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
On
విశ్వంభర, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ 61వ డివిజన్ పరిధిలోని చైతన్యపురి కాలనీలో స్థానిక ప్రజలు నిర్మించుకుంటున్న పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలు చేపడుతున్న ఈ ఆలయ నిర్మాణం కాలనీ వాసుల ప్రాంతీయ ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కాలనీ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పంజాల అశోక్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.



