భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
భారత్-పాక్ ఉద్రిక్తతపై ట్రంప్ వ్యాఖ్యలు
- భారత్-పాక్ ఘర్షణపై మరోసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్.
- తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని ట్రంప్ వ్యాఖ్య.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలపై వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపానని, భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఘర్షణను కూడా సుంకాల హెచ్చరికతో నిలిపివేశానని పేర్కొన్నారు. రెండు దేశాలపై 250 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతో యుద్ధం ఆగిపోయిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని తన వల్ల 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలపై గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ట్రంప్, మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
భారత్-పాక్ ఉద్రిక్తతపై ట్రంప్ వ్యాఖ్యలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలపై వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపానని, భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఘర్షణను కూడా సుంకాల హెచ్చరికతో నిలిపివేశానని పేర్కొన్నారు. రెండు దేశాలపై 250 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతో యుద్ధం ఆగిపోయిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని తన వల్ల 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలపై గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ట్రంప్, మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


