ప్రతి పౌరుడికి సమాన హక్కు - కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడి.

ప్రతి పౌరుడికి సమాన హక్కు - కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడి.

విశ్వంభర, నక్కలగుట్ట:- భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి అని, దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం  సమాన హక్కులు   కల్పించిందని  సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు . బుధవారం  నక్కలగుట్ట ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్  కార్పొరేట్  కార్యాలయంలో  నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ  వేడుకలకు  విచ్చేసి సీఎండీ  అధికారులు,  సిబ్బందితో  రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.  ఈ సందర్బంగా  సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి ఒక్క ఉద్యోగి తమ విధి నిర్వహణలో భాద్యత యుతంగా పని చేయాలని అన్నారు . అధికారాలు, బాధ్యతలను  సమన్వయపరుస్తూ  ఎలా ఉండాలో  కూడా  రాజ్యాంగం  నిర్దేశిస్తోందని చెప్పారు .   ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని, దేశ అభివృద్ధికి కృషి చేయాలనీ  కోరారు . ఈ కార్యక్రమంలో  డైరెక్టర్లు  వి . మోహన్ రావు , వి .  తిరుపతి రెడ్డి , సీవీవో  బోనాల కిషన్ , సి.ఈ లు టి . సదర్ లాల్ , కె . తిరుమల్  రావు , కె . రాజు  చౌహన్,   కె.  వెంకట రమణ , అశోక్ , అన్నపూర్ణ , సురేందర్ , శ్రవణ్  కుమార్ ,  సీజియంలు  రవీంద్రనాధ్ , చరణ్ దాస్ జాయింట్ సెక్రటరీ  శ్రీ కృష్ణ , జియంలు గిరిధర్ , శ్రీనివాస్ , వాసుదేవ్ , మల్లికార్జున్ , నాగ ప్రసాద్ ,  సామ్య నాయక్ , హేమంత్  కుమార్ , కళాధర్ రెడ్డి , జయరాజ్ తదితరులు పాల్గొన్నారు .

Tags: