1.2 కేజీల గంజాయి పట్టివేత

1.2 కేజీల గంజాయి పట్టివేత

విశ్వంభర, హైదరాబాద్ : నాంపల్లిలోని మెదర్ బస్తీ మల్లేపల్లి ప్రాంతంలో గంజాయి అమ్మకాలు  జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి   సిబ్బంది కలిసి నిర్వహించిన దాడుల్లో 1.2 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ గంజాయిని యుఎనఐ గ్యాస్ పాయింట్, పొట్టిశ్రీరాములు యూనివర్శీటీ    సమీపంలో గంజాయి పట్టుకున్నారు. ఈ కేసులో కాంబ్లె శ్యామ్ సుందర్‌ను  అరెస్టు చేశారు. మరో వ్యక్తి జాంగీర్‌పై కూడ కేసు నమోదు చేశారు. నిందితుడిని, గంజాయిని నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పటించారు.

Tags: