మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలి: చంద్రబాబు
On
రాష్ట్రంలో జరుగుతోన్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జరుగుతోన్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు.
రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏజెన్సీలు యువతను మోసం చేశాయన్నారు. ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడినట్లు తెలిపారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.