తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ
- 20 మంది కలెక్టర్ల మార్పు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఎన్నికలు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసింది. భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలోకి రాకముందు తాత్కాలిక బదిలీలు చేపట్టింది. పలు స్థానాల్లో ఉన్నవారిని మార్పులు చేర్పులు చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ లోక్ సభ ఎన్నికలు ముగిశాక ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి.
బదిలీ అయిన అధికారులు వీరే..
కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష, జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్, మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్, వరంగల్ కలెక్టర్గాసత్య శారదాదేవి, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభిను నియమించింది. అదేవిధంగా సూర్యాపేట కలెక్టర్గా తేజస్ నందలాల్ పవార్, హనుమకొండ కలెక్టర్గా ప్రావీణ్య, నారాయణపేట్ కలెక్టర్గా సిక్తా పట్నాయక్కు కు బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, మహబూబ్నగర్ కలెక్టర్గా విజయేంద్ర, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ వి పాటిల్, వికారాబాద్ కలెక్టర్గా ప్రతీక్ జైన్, కామారెడ్డి కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్, నల్గొండ కలెక్టర్గా నారాయణరెడ్డి, ములుగు కలెక్టర్గా దివాకరా, నిర్మల్: అభిలాష అభినవ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.