చేనేత కార్మిక కుటుంబానికి ఆర్ధిక సాయం.-అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న మహిళా కుటుంబానికి పరామర్శ
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్
On
విశ్వంభర, గట్టుప్పల : గట్టుప్పల మండల కేంద్రంలో ఇటీవల అప్పుల బాధతో చేనేత కార్మికురాలు అప్పం యాదమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం గట్టుప్పల పద్మశాలి సంఘం అధ్యక్షుడు నామని జగన్నాధంసమక్షంలో అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న ఎంతో మంది కుటుంబాలు ఆర్ధిక పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురి అవుతూ , మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం చాల బాధాకరమైన విషయం అని ఆమె అన్నారు. ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చిన్న కోట్ల సప్నా రాజ్. నోముల రేఖ, మడూర్ శశికళ, ఆడెపు శాంతి, గుర్రం శ్రవణ్ కుమార్, ఏలే మహేష్ నేత, , తీరం దాసు రాములు, నామని బుచ్చయ్య, చెరుపల్లి సత్తయ్య, సింగిల్ విండో డైరెక్టర్ చెరుపల్లి ఆంజ నేయులు, జెల్ల మరయ్య, గంజి రాములు, పద్మ శాలి యువజన సంఘం అధ్యక్షుడు పున్నకిషోర్, చిలుకూరి ఆంజయ్య, తదితరులు పాల్గొన్నారు.



